మరో అరుదైన మైలురాయి
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఒక్కఅడుగుతోనే ప్రారంభమవుతుందంటారు..ఇప్పటికే లక్షలు..కోట్ల అడుగులు పడ్డాయి. నవంబర్ 6న పడిన తొలి అడుగు అప్పుడే 2,845 కిలోమీటర్లు దాటింది. పాదయాత్ర గురువారంతో 250 రోజులకు చేరుకుంది. నాడు మహానేత చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు నెలలకు పైగా సాగగా..ఆయన తనయ షర్మిలమ్మ చేసిన మరోప్రజాప్రస్థానం సుమారు ఏడు నెలల పాటు సాగింది.
ఇక జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న పాదయాత్ర ఇప్పుడే 250 రోజుల మైలురాయిని దాటింది. ఇచ్ఛాపురం వరకు సాగే ఈ సంకల్పయాత్ర ఇంకా ఎన్ని మైలురాళ్లు దాటతాయో..ఎన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు సుదీర్ఘ పాదయాత్రలు చేయడం ఓ అరుదైన రికార్డు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరిగా ఇన్ని వందల రోజులు..ఇన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తోన్న ప్రజానేత ప్రపంచంలో మరొకరు ఉండరనే చెప్పాలి. ఈ అరుదైన మైలు రాయిని జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో అధిగమించారు. 250వ రోజు ప్రజా సంకల్పయాత్ర తుమ్మపాల నుంచి ప్రారంభమై దర్జీనగర్ వరకు సాగింది.
సంబంధిత వార్తలు