వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి

Ys jagan Praja ankalpayatra Reaches 2800 kms Mileston - Sakshi

2800 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, యలమంచిలి : ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

ప్రజాసంకల్పయాత్ర @2800 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... విశాఖ జిల్లా యలమంచిలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top