65వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు: రాజన్న బిడ్డ చేపట్టిన యాత్రలో అడుగు వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 65వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ వికృతమాల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గోవిందాపురం, చెల్లూరు క్రాస్, మూల కండ్రిగ మీదుగా ఎండీ పుత్తూరుకు చేరుకుంటారు. అనంతరం వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. దారిపొడవునా ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 875.6 కిలోమీటర్లు నడిచారు.
సంబంధిత వార్తలు