ప్రజాసంకల్పయాత్ర 16వరోజు షెడ్యూల్‌

ys jagan padayatra 16th day scheduled - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, పత్తికొండ(కర్నూలు జిల్లా) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  నేటితో 15రోజులు పూర్తిచేసుకుంది. అంతేకాకుండా పాదయాత్ర రెండువందల కిలోమీటర్ల మార్కును చేరుకుంది. ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈమేరకు 16రోజు పర్యటన వివరాలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. 

గురువారం ఉదయం 8 గంటలకు పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు రామల్లెపల్లె నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం రామల్లెపల్లె మీదుగా ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ బోయినపల్లి క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. 

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top