ప్రజాసంకల్పయాత్ర 190వ రోజు షెడ్యూలు
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారైంది. జననేత వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్ల ఆత్రేయపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కతుంగ క్రాస్, లొల్ల, వాడ పల్లి క్రాస్ మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీడుగా రావుల పాలెం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: గురువారం ఉదయం 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పేరవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఉచ్చిలి మీదుగా ఆత్రేయపురం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. జననేత వైఎస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు జననేత 12.2 కిలో మీటర్లు నడిచారు. వైఎస్ జగన్ ఇప్పటివరకు 2,341.3 కిలోమీటర్లు నడిచారు.
సంబంధిత వార్తలు