ప్రజాసంకల్పయాత్ర 189వ రోజు షెడ్యూలు

YS Jagan Mohan Reddys PrajaSankalpaYatra Scheduled On 189th Day - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారైంది. జననేత వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: బుధవారం ఉదయం 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రైల్వే ష్టేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్‌, లక్ష్మీనరసింహా నగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. జననేత వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు జననేత 12 కిలో మీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు 2,329.1 కిలోమీటర్లు నడిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top