ప్రజాసంకల్పయాత్ర 172వ రోజు షెడ్యూల్
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 172వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం నైట్ క్యాంపు(ఆకివీడు) నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. కుప్పన పుడి, కొలనపల్లి మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కాళ్ల చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ క్యాంపు అనంతరం సీసలి క్రాస్ రోడ్డు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైఎస్ జగన్ జక్కారంలో పాదయాత్ర ముగించి అక్కడే రాత్రికి బస చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత జగన్ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆకివీడులో ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 171వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆకివీడులో ముగిసింది. శుక్రవారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చిన కాపవరం, గుమ్ములూరు, తరటావా కొల్లపర్రు మీదుగా అకివీడు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.
సంబంధిత వార్తలు