90శాతం వైకల్యం ఉన్నా పింఛన్‌ ఇవ్వకుంటే ఎలా?

ఆళ్లగడ్డ: పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో ఆదివారం పాదయాత్ర జొన్నగిరి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బాలిక దస్తగిరమ్మ వైఎస్‌ జగన్‌ని కలిసి తనకు పింఛను మంజూరైనప్పటికీ వేలిముద్ర పడడం లేదని పింఛను ఇవ్వడం లేదని వాపోయింది. తనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పుడు వేలిముద్రలు ఎలా పడతాయని వాపోయింది. తమది నిరుపేద కుటుంబంమని, తన తల్లి కూడా మృతి చెందిందని విన్నవించింది. తనకు నెలనెలా పింఛను వచ్చేలా అధికారులకు సూచించాలని జననేతను వేడుకుంది. అందుకు ఆయన స్పందిస్తూ 90 శాతం వైకల్యంతో పూర్తిగా దివ్యాంగురాలైన ఇలాంటి చిన్నారికి కూడా పింఛను ఇవ్వలేదంటే ప్రస్తుత ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top