రేపు మూడు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రచారం

YS Jagan Mohan Reddy Campaign Three District Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల వారిగా ప్రచారం చేస్తున్న వైఎస్‌ జగన్‌.. రేపు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కోయలగూడెంలో రేపు ఉదయం 9 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొనన్నారు. ఆ తరువాత మధ్యాహ్నాం 12 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డ, 2 గంటలకు గుంటూరు జిల్లా వేమూరులో వైఎస్‌ జగన్‌ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top