192వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

YS Jagan Mohan Reddy 192 Day PrajaSankalpaYatra Begins At Ganti - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం  ఉదయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ గన్నవరం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top