తాడేపల్లిలో 14న జగన్‌ గృహప్రవేశం 

YS Jagan house warming at Tadepalli on Feb 14 - Sakshi

అదే రోజు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం 

సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేస్తారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓ లేఖ రాశారు.  

ఒంగోలు సమర శంఖారావం వాయిదా 
ఈ నెల 13న ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరగాల్సిన సమర శంఖారావం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా ఈ నెల 11వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో సమర శంఖారావం యథావిధిగా జరుగుతుంది. ఆ తరువాత 17వ తేదీన ఏలూరులో పార్టీ తరఫున తలపెట్టిన బీసీ గర్జనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top