310వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan Day paraja Sankalpa Yatra 310th Day Started - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 310వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఉంగరాడమెట్ట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కుమ్మరి అగ్రహారం, లింగాలవలస క్రాస్‌, రెడ్డిపేట క్రాస్‌ మీదుగా బురాడ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. 

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3352.3కిలోమీటర్లు నడిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top