నవ దంపతులకు ఆశీస్సులు
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని నవ దంపతులు కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీరామవరం గ్రామానికి చెందిన యాండ్రు శివనాగరాజు, కృపారాణి వివాహం ఈ నెల 2వ తేదీన జరిగింది. ఆ కొత్త జంట వచ్చి అన్నా మీ ఆశీస్సులు కూడా అందజేయాలని కోరారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేకల అజయ్కుమార్, కుమారిల వివాహం ఈ నెల 9న జరిగింది. వారు కూడా జగన్మోహన్రెడ్డిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు.