303వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 303వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.
జననేత వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర బుధవారం కురుపాం శివారు నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి దాసరి పేట, తల్లాడమ్మ, చిన్నమేరంగి, అల్లువాడ, పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదుమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
302వ రోజు ముగిసిన పాదయాత్ర
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 302వ రోజు ముగిసింది. విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోన్న జననేత యాత్ర బట్లభద్ర, జోగిరాజుపేట, పుతికవలస, కాటంరొరవలసక్రాస్ మీదుగా కురుపాం వరకు కొనసాగింది. మంగళవారం చేపట్టిన యాత్రలో 8.9కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ ఇప్పటివరకు 3280.4కిలోమీటర్లు నడిచారు.