వైఎస్సార్‌సీపీలోకి నందెపు శ్రీను

YS Jagan 266th Day Prajasankalpayatra Started - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు నందెపు శ్రీను చేరారు. కండువా కప్పి ఆయనను వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

మరోవైపు విశాఖపట్నం జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారి బాధలు వింటూ.. జనంతో మమేకమవుతూ జననేత వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చెర్ల క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడినుంచి సెంచూరియన్‌ యూనివర్సిటీ మీదుగా గిడిజాల వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్‌ క్యాంప్‌ నుంచి వేమగొట్టిపాలం మీదుగా పప్పలవాని పాలెం క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top