257వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

YS Jagan 257th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, పెందుర్తి : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 257వ రోజు పాదయాత్రను పెందుర్తి నియోజక వర్గం జెర్రిపోతులపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పెదనరవ, కోటనరవ, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెం, గోపాలపట్నం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

రాజన్న బిడ్డను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి జననేతకు ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top