214వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 214th Day Praja Sankalpa Yatra Schedule Released - Sakshi

సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 213వ రోజు ప్రజాసంకల్పయాత్రను సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దాడ నుంచి పాదయాత్రను జననేత ప్రారంభించారు. అక్కడి నుంచి పెదపూడి, దొమ్మడ మీదుగా కరకుదురు వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ రోజు వైఎస్‌ జగన్‌ 9.3 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆయన 2,543.2 కిలో మీటర్లు నడిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top