212వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, అనపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 212వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
వైఎస్ జగన్ శనివారం ఉదయం ఉలపల్లి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బిక్కవోలు చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బిక్కవోలు నుంచి పెదపూడి మండలం గొల్లాల మామిడాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.