రోజు రోజుకూ వైఎస్సార్‌ సీపీ బలోపేతం

Youth Join YSRCP In East Godavari - Sakshi

తూర్పుగోదావరి  ,మలికిపురం (రాజోలు): రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ రోజు రోజుకూ మరింత బలపడి  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని నియోజక వర్గం పార్టీ కోఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో పార్టీ కార్యాలయం వద్ద  కొల్లాబత్తుల రఫీక్‌ సుమారు 100 మంది తన స్నేహితులతో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీకి ఆకర్షితులైన రఫీక్‌కు కండువా వేసి ఆయనతో పాటు ఫ్రెండ్స్‌ను కూడా రాజేశ్వరరావు పార్టీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి సూరిశెట్టి బాబి, నాయకులు ఇందుకూరి పిప్పరాజు, మాజీ సర్పంచ్‌ పోతుల కృష్ణ, గుండుమేను శ్రీనివాస్‌ యాదవ్, చిత్రపు చిన్నారెడ్డి, చెవ్వాకుల మాధవరావు, కలిగినీడి రమేష్, నల్లి గోపి రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top