టీడీపీ నేతలు మా నాన్నను చంపి .. మమ్మల్ని వేధిస్తున్నారు
విశాఖపట్నం :మా నాన్న సత్యనారాయణ.. బిల్డర్ పోతంశెట్టి రాంబాబు వద్ద వాచ్మన్. ఈ ఏడాది జనవరి 5న హత్యకు గురయ్యాడు. ఆయన శరీరం మొత్తం గాయాలు, రక్తం. బిల్డర్తో పాటు మేస్త్రీ ప్రగడ నాగబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని పాయకరావుపేట ఎస్ఐ రామకృష్ణను కోరాం. 3 గంటలైనా రాకపోవడంతో దహన సంస్కారాలు చేశాం. తర్వాత వెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫిబ్రవరి 2న నక్కపల్లి సర్కిల్ ఆఫీస్కి వెళ్లాం సీఐ రుద్రశేఖర్ మమ్మల్ని చూసి కోపంతో రిపోర్టు తీసుకోను దిక్కున్న చోట చెప్పుకోమన్నారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాం..ఎమ్మెల్యే అనిత దగ్గరకు వెళ్లాం. అయినా న్యాయం జరగలేదు. బిల్డర్, మేస్త్రీ కూడా టీడీపీ వారే కావడంతో అధికారపార్టీ నాయకులు మమ్మల్ని ఇప్పటికీ వేధిస్తున్నారు. ఏడు మాసాలుగా డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. మాకు ఏ ఆధారం లేదు. మా అమ్మకు వితంతు పింఛను అడిగినా టీడీపీ నాయకులు కనికరించట్లేదు. పోలీసులు వారికే వంతపాడుతున్నారు. మా నాన్నను హత్యచేసిన వారిని శిక్షించేందుకు సహకరించండన్నా అని కోరగా మీకు నేనున్నాను భయపడకండి అంటూ జగన్ అభయమిచ్చారు. – శకునాల రమ, లత, అరట్లకోట, పాయకరావుపేట మండలం
సంబంధిత వార్తలు