మీ తరఫున పోరాడతా..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 104 ఉద్యోగులకు పని భద్రత కల్పిస్తానని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. శనివారం కొందరు 104 ఉద్యోగులు ఆయనను కలసి సమస్యలను విన్నవించారు. అనంతరం వైఎస్ జగన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పని భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు అవినీతి, అక్రమాలపై తాను చేస్తున్న పోరాటంలో అందరూ కలసి రావాలని కోరారు.