ఊలపల్లిలో పూలబాట..

Womens Welcomes YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జనం కోసం పాదయాత్రగా వస్తున్న జగన్‌కు అనపర్తి నియోజకవర్గంలోని ఊలపల్లిలో లంకలో ప్రజలు పూలతో బాట వేశారు. సామాన్య కుటుంబాలకు చెందిన వారైనా జగన్‌పై ఉన్న అభిమానంతో పూలను తెచ్చి బాటవేశారు. పాదయాత్ర ప్రారంభం కాగానే తమ కష్టాలను జగన్‌కు చెప్పుకున్నారు. వైఎస్‌ హయాంలో తమ కుటుంబాలు పొందిన ప్రయోజనాలను చెప్పి కృతజ్ఞతలు చెప్పారు. తామంతా మీకు అండగా ఉంటామంటూ అభిమానాన్ని చాటుకున్నారు. వారందరి సమస్యలు విన్న జగన్‌ రానున్నవి మంచి రోజులంటూ భరోసానిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top