కష్టజీవికి హారతి ఇచ్చాను

Womens Welcomes YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జనం కోసం ఆలోచించేవాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువ. అలాంటిది కాలినడకన ప్రజల దగ్గరకు వస్తున్న జగన్‌కు అంతా మంచే జరగాలి. అందుకే ఆ బిడ్డకి హారతి పట్టాను. ఆయన చల్లగా ఉంటే జనమంతా బాగుంటారని ఊలపల్లి గ్రామానికి చెందిన పంపన చంద్రకాంతం అన్నారు.

ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాం
జగనన్న ఆటోగ్రాఫ్‌ తీసుకున్నామని ఊలపల్లికి చెందిన అక్కాతమ్ముళ్లు నున్న అక్షర, కిశోర్‌చంద్రలు తెలిపారు. గ్రామానికి వచ్చిన జగన్‌ను కలిసేందుకు తల్లి ఉషారాణితో పాటు వచ్చిన వారు ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఆ ఆటోగ్రాఫ్‌లు చూసుకుంటూ వారు మురిసిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top