ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదు

Womens Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం:ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు గౌరవం లేదని, పెత్తనమంతా జన్మభూమి కమిటీలదేనని గాంధీనగరం ఎంపీటీసీ సభ్యురాలు ఈ.పుష్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గాంధీనగర్‌ జంక్షన్‌లో ఆమె కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ కాలేదని, పింఛన్లు, రేషన్‌ కార్డులు, రుణాల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువగా ఉందని, ఎన్నికైన తాము ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top