అమ్మా.. అమ్మా.. అని పిలిచారు..

Women Meets YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : ములగపూడి వద్ద జగనన్నను కలిశాం. మా కుమార్తెకు మీ అమ్మగారి పేరు ‘విజయమ్మ’ అని పెట్టుకున్నాం.. అని చెప్పాను. జననేత పాపను ఎత్తుకుని అమ్మా.. అమ్మా.. అంటూ గుండెలకు హత్తుకున్నారు. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. బాగా చదివించమ్మా.. అని చెప్పారు. ఈ అనుభవాన్ని జీవితంలో మరచిపోలేం. మేము వైఎస్సార్‌ అభిమానులం. మా తోటికోడలు వైఎస్సార్‌సీపీ తరఫున వార్డు మెంబర్‌గా గెలుపొందింది. టీడీపీలోకి రమ్మని ఒత్తిడి వచ్చినా వెళ్లలేదు. కక్ష పెట్టుకుని మా కుటుంబానికి ఏ ప్రభుత్వ లబ్ధి రానీయకుండా చేస్తున్నారు. మా పెంకుటిల్లు వర్షం వస్తే కారిపోతోంది. స్కీమ్‌ ఇల్లు మంజూరు చేయండని అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న అధికారంలోకి వస్తే మాలాంటోళ్లందరికీ సొంతిల్లు వస్తుంది.  – కొన్నపు లోవ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top