ముగ్గురితోనూ పాదయాత్రలో పాల్గొన్నా..
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానంలో భాగంగా రాష్ట్రమంతా నడిచాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు వారికి తన పథకాల ద్వారా లక్షాధికా రులను చేశారు. ఆయన తనయ షర్మిలమ్మతో మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నాను. ఆపరేషన్ కారణంగా ఆరు జిల్లాలలోనే నడిచాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ఇడుపులపాయ నుంచి పాదయాత్రలో పాల్గొంటున్నాను. మనందరి మాట దేవుడు విని ఆయన్ని సీఎం చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. – రామినేని రమాదేవి, కంకిపాడు
సంబంధిత వార్తలు