స్వర్ణకారులను ఆదుకో అన్నా..

Woman Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి ,అంబాజీపేట: ఎన్నో హంగులతో బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయని.. తమ బతుకులను మెరుగుపర్చాలని ప్రజానేత వద్ద పెద్దాపురం స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామర్లకోట మండలం ఉండూరులో జరిగిన పాదయాత్రలో ప్రజానేతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కింతాడ పద్మవతి, శేకర్‌లు మాట్లాడుతూ స్వర్ణకారులు ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. రడీమేడ్‌ షాపులు రావడం వల్ల చేతి వృత్తిల వారికి పనులు లేక పస్తులుంటున్నామన్నారు. పెళ్లి కూతురుకి మంగళసూత్రాలు తయారు చేసే స్వర్ణకారుడుకు బతుకుదెరువు లేక భార్య మెడలో మంగళసూత్రాలను కూడా అమ్ముకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలతో సతమతమవుతున్న  స్వర్ణకారుల బతుకుల్లో వెలుగులు నింపాలని జగన్‌ను కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top