కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..

Woman Dies Of Heart Attack While Treatment To Son In Kadapa District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : జిల్లాలోని బద్వేలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడికి వైద్యం చేయించేందుకు వచ్చిన ఓ తల్లి అనూహ్యరీతిలో ప్రాణాలు విడిచారు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటడంతో వెంకటదేవి అనే మహిళ అతన్ని తీసుకుని బద్వేలులోని సుమిత్రానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడిక్కడే ఆమె కుప్పకూలిపోయారు. వెంకటదేవి మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top