రోజాపై రూ. కోటి పరువునష్టం దావా: టీడీపీ ఎమ్మెల్యే అనిత
సాక్షి, విశాఖపట్నం: నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తున్నట్టు విశాఖ జిల్లా పాయకరావుపేట శాసనసభ్యురాలు వి.అనిత తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా తన పట్ల అభ్యంతరకరంగా మాట్లాడినందుకుగానూ ఆమెపై రూ. కోటి రూపాయల పరువునష్టం దావా వేయనున్నట్లు అనిత వెల్లడించారు.
బుధవారం విశాఖపట్టణంలో విలేకరులతో మాట్లాడిన ఆమె రోజాలో పశ్చాత్తాపం కనిపిస్తుందేమోనని ఇన్నాళ్లూ వేచిచూశానని, అందుకే దావా వేయటంలో ఆలస్యం తలెత్తిందని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును వివరిస్తూ ప్రతిపక్ష సభ్యులను తీవ్రవాదులతో పోల్చారామె.