న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ పెంచేందుకు సాయపడండి
విశాఖపట్నం :న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ రూ.3లక్షల నుంచి 5లక్షలకు పెంచారు. మేం దీనిని రూ.15లక్షలకు పెంచమని అడుగుతున్నాం. అలాగే చోడవరం సుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవకతవకలపై పూర్తిగా విచారణ జరిపించాలి. చోడవరం–నర్సీపట్నం రహదారిని విస్తరించాలి. గతంలో ప్రతిపాదించిన చోడవరం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. చోడవరం కోర్టును అప్గ్రేడ్ చేయాలని చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి డేవిడ్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.