కోస్తాంధ్ర వెదర్ రిపోర్ట్
సాక్షి, విశాఖపట్నం : ఈ రోజు రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య ఉపరితల ఆవర్తనం బలపడి రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒడిశా మీదగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని సూచించింది. దీంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కీమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.