నీటి పన్ను భారం
మేం నాయిబ్రహ్మణులం. పెందుర్తి మండలం నరవలో ఇంటికి ఆనుకొని సెలూన్ షాపు నిర్మించుకున్నాం. గతంలో మా ఇళ్లకు నీటి పన్ను ఏడాదికి రూ.720 మాత్రమే వచ్చేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ నీటి పన్నులు భారీగా పెంచేసింది. ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడు విడతల్లో రూ.13వేలు నీటి పన్ను బిల్లు ఇచ్చారు. అంత సొమ్ము చెల్లించలేక పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగాం. కానీ మా సమస్య పరిష్కారం కాలేదు.