పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదన్నా...
తూర్పుగోదావరి ,అంబాజీపేట: సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో పంచాయతి ఎన్నికలు నిర్వహించకుండా కాలం వెళ్లదీస్తున్నారని జననేతకు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ మేరకు గ్రామంలో జరుగుతున్న పాదయాత్రలో వైఎస్.జగన్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉండూరు గ్రామాన్ని సామర్లకోట మున్సిపాలిటీలో విలీనం పేరుతో 2014లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు.
ఉండూరు నుంచి మున్సీపాలిటి 6 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులంతా ఏకమై హైకోర్టును ఆశ్రయించామన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేటి వరకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించేలా కృషి చేయాలని జననేతను మాజీ సర్పంచ్ కొప్పిరెడ్డి రాధాకృష్ణతో పాటు గ్రామస్తులు కోరారు.
సంబంధిత వార్తలు