ఉపాధి కూలి దినాలు పెంచాలి..
తూర్పుగోదావరి : ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 200కు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలిని రూ.300కు పెంచాలని జగన్ను కోరారు ఆనూరుకు చెందిన పైడిమళ్ళ వీర్రాజు. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాను జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నానన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ యువకులకు పని దొరుకుతుందని, గ్రామీణ నిరుద్యోగం తగ్గుతుందని జగన్కు చెప్పానన్నారు.
సంబంధిత వార్తలు