ఏడాదైనా వేతనం లేదు
విజయనగరం :గత ఏడాది రెండు నెలల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లాను. దాదాపు రూ.8 వేల వరకు వేతనం రావలసి ఉంది. సొమ్ము ఇప్పించాలని అధికారులు, నేతల్ని ఎన్నోసార్లు సంప్రదించాను. ఏడాది దాటినా నా సమస్య తీరలేదు. కష్టపడినా సొమ్ము చేతికందకపోవడం చాలా బాధగా ఉంది. కూలికి వెళ్తేనే జీవనం గడుస్తుంది. ఇంకుడు గుంతల సొమ్ము కూడా అందలేదు. వేతనాలు అందకపోతే ఎలా బతకాలి.. అంటూ మక్కువ మండలం డి.శిర్లాం గ్రామానికి చెందిన కోరాడ సుబ్బలక్ష్మి వాపోయింది.