జిల్లాను దత్తత తీసుకోవాలి
శ్రీకాకుళం :జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. శ్రీకాకుళం జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధికి బాటలు వేయాలి. కిడ్నీ సంబంధిత సమస్యలతో దాదాపు 4వేల మంది జిల్లాలో మృత్యువాత పడ్డారు. ఈ సమస్య ఉన్న ప్రాంతాల్లో సర్ఫేస్ వాటర్ను అందించాలి.– డి.విష్ణుమూర్తి, ఐతం ఇంజినీరింగ్ కళాశాల డీన్, టెక్కలి– సురంగి మోహనరావు, జెడ్పీ మాజీ సీఈవో, శ్రీకాకుళం