‘అధికారంలోకి రాగనే వారి భరతం పడతాం’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చట్ట పరిధి నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వీరందరి భరతం పడతామన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ. 15.55 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.