విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా బాబు?

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు.‘‘ హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి.. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా..? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు. వైఎస్‌ జగన్ దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top