‘అయిదేళ్లు మాటలతో సరిపెట్టాడు’

Vellampalli Srinivas Comments On Chandra Babu In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : పాలన చేతకాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయిదేళ్లు మాటలతో సరిపెట్టాడని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు అండగా నిలిచారని ప్రశంసించారు. పరిశ్రమలను బతికించేందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో ఏ రాష్టమూ ప్రకటించని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాయితీలు ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణలకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రోత్సహించకపోగా బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. (ఉద్యోగులకు మే నెల వేతనాలు పూర్తిగా చెల్లింపు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top