తిరుమలలో మద్యపాన నిషేధంపై మార్పులు
సాక్షి, తిరుమల : తిరుపతిలో మద్యపాన నిషేధంపై గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో అధికారులు పలు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వంటి ప్రధాన కూడళ్లతోపాటు భక్తులు తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలలో మాత్రమే మద్యపాన నిషేదం అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై తర్వాత పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.