ఒకే రోజు 1,199 మంది డిశ్చార్జి

Total number of Corona cases reached above 27 Thousand In AP - Sakshi

14,393కి చేరిన కోలుకున్న వారి సంఖ్య

1,813 కేసులతో 27,235కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

309కి చేరిన మరణాల సంఖ్య

సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నాలుగు రోజుల నుంచి వెయ్యి దాటుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకోవడంతో 1,199 మందిని డిశ్చార్జి చేసినట్లు వైద్యారోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 14,393కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 20,590 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 1,813 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,36,225కి, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,235కి చేరింది. ఇందులో 2,385 కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినవి కాగా, 428 కేసులు విదేశాలకు చెందినవి. రాష్ట్రంలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 309కి చేరితే యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,533గా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top