నేడు విశాఖలోకి ప్రజాసంకల్పయాత్ర
విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర శనివారం విశాఖ నగర పరిధిలోకి ప్రవేశించనుందని పార్టీ ప్రొగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం వెల్లడించారు. 257వ రోజు పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండల పరిధిలోని గ్రామాలతోపాటు విశాఖ పశ్చిమ నియోజక వర్గంలోని వార్డుల పరిధిలో సాగనుందని ఆయన తెలిపారు. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం నుంచి ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర నరవ, ఎస్సీ కాలనీ, పెదనరవ, కోటనగరవ, కొత్తపాలెం, భగత్సింగ్నగర్, కార్వల్ నగర్, సాయినగర్, అప్పలనరసయ్యకాలనీ, నాగేంద్రకాలనీ, గణపతినగర్, శ్రీరామ్నగర్ల మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్ వరకు సాగనుందని ఆయన చెప్పారు. నగరంలో అడుగుపెడుతున్న ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు.