ఈనాటి ముఖ్యాంశాలు
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్పై విషం చిమ్మిన పాకిస్తాన్కు తగిన సమాధానం చెప్పింది భారత్. జమ్ము కశ్మీర్లో శనివారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుందని, దాని ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.