ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu news Sep 25th Comedian Venu Madhav Dies in Hyd - Sakshi

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. కొన్ని క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌ను మూసివేస్తున్నట్టు వ‌స్తున్న వార్తలను బుధవారం ఆర్బీఐ ఖండించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తల్లో నిజంలేద‌ని ఆర్బీఐ చెప్పింది. పాకిస్థాన్‌తో చ‌ర్చలు నిర్వహించ‌డం స‌మ‌స్య కాదు, కానీ టెర్రరిస్తాన్‌తో చ‌ర్చలు చేప‌ట్టడం అసాధ్యమ‌ని విదేశాంగ మంత్రి జైశ‌కంర్ అన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top