ఈనాటి ముఖ్యాంశాలు
అన్ని రకాల కార్డుల స్ధానంలో బహుళ అవసరాల కోసం ఒకే ఒక మల్టీపర్పస్ కార్డును తీసుకురావాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మన వద్ద గుర్తింపు కార్డు సహా ఓటర్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ వంటి మల్టీ పర్పస్ గుర్తింపు కార్డు పధకం లేకున్నా దీన్ని తీసుకురావడం సాధ్యమేనని చెప్పారు. జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా శ్రీనివాసన్, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు ప్రమాణస్వీకారం చేశారు. నగరంలోని అమీర్పేట్లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టి... పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.