సబ్బవరంలో నేడు బహిరంగ సభ

Today Public Meeting In Sabbavaram Visakhapatnam - Sakshi

గుళ్ళేపల్లి నుంచి యాత్ర ప్రారంభం

విజయవంతం చేయాలని

తలశిల రఘురాం పిలుపు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 255వ రోజు  బుధవారం పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుందని పార్టీ ప్రోగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. సబ్బవరం జంక్షన్‌లో మ ద్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారని చెప్పారు. సబ్బవరం మండలం గుళ్లేపల్లి నుంచి ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర రావులంపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్, స బ్బవరం మీదుగా చినగొల్లలపాలెం క్రాస్‌ వరకు సాగనుందన్నారు. సబ్బవరం మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర, సబ్బవరం జంక్షన్‌లో జరిగే భారీ బ హిరంగకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top