నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....

Today Praja Sankalpa Yatra Schedule - Sakshi

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ

కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం వెల్లడి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.  మంగళవారం ఉదయం 7.30 గంటలకు మక్కువ మండలం కొయ్యానపేట రాత్రిబస వద్ద ప్రారంభమై పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం తామరఖండి వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. కొయ్యానపేట రాత్రిబస వద్ద ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై కంచేడువలస క్రాస్, వెంకట భైరిపురం వరకూ సాగుతుందని, అక్కడినుంచి భోజన విరామానంతరం పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్‌ మీదుగా 4:30గంటలకు తామరఖండి చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడే రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top