ప్రజాసంకల్పయాత్రకు నేడు విరామం

Today Praja Sankalpa Yatra Break For Vinayaka Chavithi - Sakshi

శనివారం యాత్ర పునఃప్రారంభం

పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ చైర్మన్‌ తలశిల

సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్‌ విశా ఖపరిధిలో విజయవంతంగా సా గుతున్న ప్రజాసంకల్పయాత్రకు వినాయక చవితి సందర్భంగా గురువారం విరామం ప్రకటించి నట్టు వైఎస్సార్‌సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ తలశిల రఘురాం చెప్పారు. విశాఖ నగరంలో పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. విశాఖ పశ్చిమలో అడుగుపెట్టిన పాదయాత్ర విశాఖ ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో పూర్తయిందని, ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజక వర్గంలో విజయవంతంగా సాగుతుందన్నారు. వినాయక చవితిని ప్రజ లంతా ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా గురువారం పాదయాత్రకు విరామం ఇస్తున్నామన్నారు. పాదయాత్ర తిరిగి శనివారం చినగదిలినుంచే ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top