ఈనాటి ముఖ్యాంశాలు

Today news updates Sep 27th Azharuddin elected as HCA president - Sakshi

జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికి గానూ, ఈ ఏడాదికి ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవార్డు దక్కించుకోగా, తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. వివేక్‌ ప్యానల్‌ అభ్యర్థి ప్రకాశ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అజారుద్దీన్‌కు 146 ఓట్లు, ప్రకాశ్‌కు 73 ఓట్లు పోలయ్యాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థం (నాసా) శుక్రవారం చంద్రయాన్‌-2కు సంబంధించిన కీలక ఫొటోలను విడుదల చేసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top