ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా సవరణ బిల్లును రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్ధిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రపంచకప్ ఫైనల్ ఫలితంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఐసీసీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్లోని కొన్ని రూల్స్పై సీరియస్గా దృష్టిసారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..